☼ Suryaa News
🔴 జాతీయం రేపు మహారాష్ట్రలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన
జాతీయం

రేపు మహారాష్ట్రలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన

17 Sep 2026 vasu

న్యూఢిల్లీ:ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు మహారాష్ట్రలో పర్యటించనున్నట్లు ఉపరాష్ట్రపతి సచివాలయం తెలిపింది. ఈ ఒకరోజు పర్యటనలో భాగంగా ఆయన ముంబై, లోనావాలా మరియు పూణే నగరాల్లో పలు అధికారిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉపరాష్ట్రపతి శుక్రవారం ఉదయం ముంబైలోని ప్రముఖ 'లాల్‌బాగ్ చా రాజా' గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం లోనావాలా చేరుకుని, కైవల్యధామలోని 'గోర్ధన్‌దాస్ సేక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా & కల్చరల్ సింథసిస్' ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాయంత్రం పూణేలోని నెహ్రూ స్టేడియం వద్ద ఉన్న శ్రీ గణేష్ కళా క్రీడా రంగమంచ్‌లో ఘనంగా జరిగే 38వ పూణే ఉత్సవాల (Pune Festival) కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home