☼ Suryaa News
🔴 జాతీయం ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్
జాతీయం

ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్

14 Sep 2026 vasu

న్యూఢిల్లీ:ప్రపంచంలో తీవ్ర విభేదాలు, ధ్రువీకరణలు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ ఐక్యతకు, ఏకాభిప్రాయ సాధనకు బలమైన వేదికగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశం విజయవంతంగా ముగియడంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఈ సదస్సుకు 32 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా పలు దేశాధినేతలు, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పాల్గొన్నారని ఆయన తెలిపారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల్లోనూ పశ్చిమ ఆసియా సంఘర్షణలు, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం సాధించడమే భారత్ దౌత్య బలానికి నిదర్శనమని స్పష్టం చేశారు.

ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని బ్రిక్స్ ఏకగ్రీవంగా పునరుద్ఘాటించిందని జైశంకర్ తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు పహల్గామ్ దాడిని 'న్యూఢిల్లీ ప్రకటన' తీవ్రంగా ఖండించిందని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిపై జవాబుదారీతనం తప్పదని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రధాని మోదీ నాయకత్వంలోని సంభాషణ, దౌత్యం మరియు అభివృద్ధి సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home