కొలంబో:శ్రీలంకలో మూడు రోజుల అధికారిక పర్యటన కోసం మంగళవారం రాజధాని కొలంబో చేరుకున్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అక్కడి భారతీయ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. భారత్, శ్రీలంక మధ్య ద్వైపాక్షిక, సముద్ర మరియు భద్రతా సహకారాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా శ్రీలంక అగ్ర నాయకత్వంతో వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపడంతో పాటు భారతీయ ప్రవాసులతో కూడా ఆయన సమావేశం కానున్నారు.
భారతదేశ 'పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యత' (Neighbourhood First) విధానం మరియు 'మహాసాగర్' (MAHASAGAR) దార్శనికతలో శ్రీలంక అత్యంత కీలకమైన భాగస్వామి అని రక్షణ మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో ఆర్థిక సంక్షోభ సమయంతో పాటు, 2025లో దిత్వా తుఫాను సంభవించినప్పుడు శ్రీలంకకు భారత్ తక్షణ సహాయం అందించడమే కాకుండా.. పునర్నిర్మాణం కోసం 450 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. రెండు దేశాల మధ్య రక్షణ, సైనిక సహకారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకే రాజ్నాథ్ సింగ్ పర్యటన దోహదపడుతుందని అధికారులు తెలిపారు.