
చివరి షెడ్యూల్లో యంగ్ ఇండియా
డా. దాసరి దర్శత్వంలో నూతన తారాగణంతో రూపొందుతున్న ‘యంగ్ ఇండియా’ చిత్రం ఫిబ్రవరి 8నుంచి రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్ జరుగుతోంది. సిరి మీడియాప్రై.లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ శ్రీమతి దాసరి పద్మ. ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక సంచలనమైన కథతో డా.దాసరి నారాయణరావు గారు ఈ చిత్రాన్ని అంతా కొత్తవారితో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఫిబ్రవరి 8న రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ 22వరకు జరుగుతుంది. దాంతో దాదాపు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
కీరవాణి స్వరపరచిన 6పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా వున్నాయి. ఈ చిత్రం ద్వారా మేం పరిచయం చేస్తున్న నటీనటుల్లో కనీసం 10మంది స్టార్స్ అవుతారన్న నమ్మకం వుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, ఛాయాగ్రహణం: సిహెచ్.రమణరాజు, ఎడిటర్: గౌతంరాజు, కళ: బి.వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.జగదీశ్వర ప్రసాద్, సమర్పణ: శ్రీమతి దాసరి పద్మ, నిర్మాత: రామకృష్ణ ప్రసాద్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: డా.దాసరి నారాయణరావు.
- ‘కొమరం పులి’ సెన్సార్ పూర్తి !
- మకతిక మాయా మశ్చీంద్ర మనసిక మస్తీ కిష్కిందా !
- ఏమైంది.. ఈ వేళ.. ?
- అహనా పెళ్లంట... మ్యాచ్ ఫిక్సింగ్
- నవగ్రహ ప్రభావం తెలిపే చిత్రం !
- రాణా చిత్రం ప్రారంభం !
- మరణం తర్వాత... ఏం జరుగుతుంది ?
- ‘రంగ... ది దొంగ’ పాటల విడుదల
- ప్రేమికులకు పోటీ !
- అందమైన జీవితం
- ‘మార్పు ’ కోసం
- భరత్ను ‘బల్లెం’ గా మార్చిన ‘యముడు’ దర్శకుడు !
- ‘చిలిపి అల్లరిలో’ పాటల రికార్డింగ్
- వివాదం బోనులో కొమరం పులి
- కల్యాణం.. కమనీయం
- కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్చరణ్తేజ్
- ముద్దు మీద ముద్దు పెట్టు !
- నిత్యానంద ప్రసాద్
- అకాశమే హద్దు... అవకాశం వదలొద్దు
- తిండి- బట్ట - ప్రేమ


























































