ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘కుబేర’. అహ్మదాబాద్ ఎయిర్ఇండియా ఘోర ప్రమాదం నేపథ్యంలో జూన్ 13న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో కొత్త ముహూర్తాన్ని మేకర్స్ ఫిక్స్ చేశారు. జూన్ 15(ఆదివారం) సాయంత్రం ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రకటించారు. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ జూన్ 20న థియేటర్లలోకి రానుంది.
![]() |
![]() |